LBF News

/ Sep 24, 2025

పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయి

. పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ బి. అనురాధ

సిద్దిపేట : పదోన్నతులు జీవన శైలిని  మార్చే విధంగా ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి, కానిస్టేబుల్‌ నుండి హెడ్‌ కానిస్టేబుల్‌ గా ప్రమోషన్‌ పొందిన వారి వివరాలు:టి. రాజేశం, పోలీస్‌ స్టేషన్‌ తొగుట,యస్‌. ఉదయ్‌ కుమార్‌, పోలీస్‌ స్టేషన్‌ రాయపోల్‌. కె. సుధాకర్‌ రెడ్డి, పోలీస్‌ స్టేషన్‌ టూ టౌన్‌. వి. యేసు స్వామి, ఎస్బి  సిద్దిపేట్‌. కె. రవిరాజు, పోలీస్‌ స్టేషన్‌ సిద్దిపేట రూరల్‌. యాదయ్య, సిసిఎస్‌ సిద్దిపేట. కె. అంజిరెడ్డి, పోలీస్‌ స్టేషన్‌  దుబ్బాక.ప్రమోషన్‌ పొందిన సిబ్బంది   మర్యాదపూర్వకంగా పోలీస్‌ కమిషనర్‌ కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. పోలీస్‌ కమిషనర్‌   అభినందించారు.ఈ సందర్భంగా పోలీస్‌  కమిషనర్‌  మాట్లాడుతూ. పోలీస్‌ శాఖలో పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయని అన్నారు, పదోన్నతులు పొందిన పోలీస్‌ సిబ్బంది మన జిల్లాలో మనము ప్రజల గురించి పనిచేస్తున్నామని రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. పోలీసు శాఖలో క్రమశిక్షణతో బాధ్యతగా విధుల పట్ల నిబద్ధతతో వ్యవహరించే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, గౌరవ మర్యాదలు లభిస్తాయని తెలియజేశారు, సీనియార్టీ ప్రకారం అందరికీ ప్రమోషన్స్‌ రావడం జరుగుతుందన్నారు. హెడ్‌ కానిస్టేబుల్‌ గా ప్రమోషన్‌ రావడంతో ఆనందం వ్యక్తం చేసి ఉన్నత అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్బి ఇన్స్పెక్టర్‌ కిరణ్‌, రాష్ట్ర పోలీసు సంఘం ఉపాధ్యక్షులు రవీందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.