. అంతరిక్షంలోకి ప్రయాణిస్తున్న భారతీయుడు శుభాన్షు శుక్లాకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అభినందన
న్యూఢల్లీ :‘ఆగ్జియోమ్ మిషన్ 4’లో భాగంగా 140 కోట్ల మంది భారతీయులకు వహిస్తూ అంతరిక్షంలోకి వెళ్తున్న శుభాన్షు శుక్లా కు హృదయపూర్వక అభినందనలు. 41 ఏళ్ల క్రితం రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి అడుగుపెడుతున్న రెండో భారతీయుడిగా, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్తున్న తొలి భారతీయుడిగా శుభాన్షు చేస్తున్న ప్రయాణం ప్రతిభారతీయుడికీ గర్వకారణం. ఈ 14రోజుల ఈ ప్రయాణం విజయవంతమై అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.‘ఆగ్జియోమ్ మిషన్ 4’లో భారత్ ప్రాతినిధ్యం వహించడం.. అంతరిక్ష రంగంలో భారతదేశం ఎదుగుతున్న తీరుకు ఒక ఉదాహరణ మాత్రమే. గత పదేళ్లుగా అంతరిక్ష పరిశోధనల్లో భారతదేశం.. అగ్రదేశాలకు దీటుగా చేస్తున్న ప్రయోగాలు విజయవంతం అవుతున్నాయి. మంగళ్యాన్ (2014), చంద్రయాన్ `2 (2019), చంద్రయాన్`3 (2023) (2024), (2023`24), మిషన్ గగన్యాన్ తయారీ వంటి ప్రయోగాలు ఇస్రోను గ్లోబల్ స్పేస్ లీడర్ గా నిలిపాయి. ఇది పదేళ్లలో మోదీ సర్కారు తీసుకొచ్చిన సంస్కరణలకు ఇస్తున్న ప్రోత్సాహానికి మచ్చుతునక. భవిష్యత్తులో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మరింత అభివృద్ధిని సాధించేలా ఈ ప్రయోగం నిలవనుంది. శుభాన్షు శుక్లాతో పాటు ఈ ప్రయోగంలో భాగంగా అంతరిక్షంలో అడుగుపెట్టిన హంగేరీ, పోలండ్, అమెరికా దేశ వ్యోమగాములకు కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.