LBF News

/ Sep 26, 2025

సంక్షేమ వసతి గృహాల్లో అన్ని సౌకర్యాలు సమకూర్చి విద్యార్థుల అడ్మిషన్లు  పెంచాలి

సిద్దిపేట : జిల్లాలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలు, గురుకుల జూనియర్‌ కళాశాలు, సంక్షేమ వసతి గృహాల్లో అన్ని సౌకర్యాలు సమకూర్చి విద్యార్థుల అడ్మిషన్లు  పెంచాలని జిల్లా కలెక్టర్‌ కె. హైమావతి అధికారులను ఆదేశించారుగురువారం సవిూకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్‌ హల్‌ లో జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ, సంక్షేమ శాఖల అధికారులు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ లతో జిల్లా కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ.ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ నుండి మంజూరైనా నిధులను కళాశాలలకు పెయింటింగ్‌, టేబుల్స్‌, డ్యూయల్‌ డెస్క, విండోస్‌ రిపేర్‌ చేయించుకోవాలని అధికారులకు తెలిపారు. ఇంజనీరింగ్‌ ఏజెన్సీ నిర్వహించే అన్ని పనులు నాణ్యత ప్రమాణాలు పాటించాలని తెలిపారు. అత్యవసర తాగునీటి వసతి, మరియు మరుగుదొడ్ల నిర్మాణం కోసం  నిధులు  మంజూరు చేస్తానని ఇంజనీరింగ్‌ ఏజెన్సీ కావలసిన వాటికి ఎస్టిమేట్‌ తయారు చెయ్యాలని ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుండి కళాశాలకు రావడానికి బస్‌ సౌకర్యం కోసం ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్‌ అర్టిసి అధికారులతో సమావేశం నిర్వహించి కావలసిన రూట్ల కు బస్‌ సౌకర్యం మరియు కొన్ని కళాశాలలకు బస్‌ పరిథి పెంచేందుకు నోట్‌ తయారు చేసి ఆయా రీజనల్‌ మేనేజర్‌ లెటర్‌ పెట్టాలని తెలిపారు. జూనియర్‌ కళాశాల మరియు అన్ని హాస్టల్‌ లలో అన్ని సౌకర్యాలు సమకూర్చి ఒక్క సీటు మిగలకుండా విద్యార్థులు చేరేందుకు చర్యలు తీసుకోవాలి. అధికారులు మరియు ప్రిన్సిపల్స్‌ విద్యార్థుల పట్ల మాన వీయ కోణం లో ఆలోచించాలని, గజ్వేల్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌ మరియు కొన్ని కళాశాలలో రాత్రి వేళల్లో ఆకతాయిలు చేరి మద్యం తాగుతూ, కిటికీలు, డోర్‌, టాయిలెట్స్‌  ఇతరత్రా ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని తెలపగా సీసీ కెమెరాల పిట్టింగ్‌ చేసుకోవాలని పోలీస్‌ అధికారులకు లెటర్‌ పెట్టీ పికెటింగ్‌ ఏర్పాటు చేసి విద్యార్థుల భద్రతలో రాజిపడవద్దని కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డిఐఈఓ రవీందర్‌ రెడ్డి, డిఆర్డిఓ జయదేవ్‌ ఆర్య, డిబిసీడీవో నాగరాజమ్మ, డిఎస్సిడిఓ కవిత, ఆయా కళాశాలల ప్రిన్సిపాల్‌ లు తదితరులు పాల్గొన్నారు.