విశాఖ : కత్తితో బెదిరించబోయిన రౌడీ షీటర్ హత్యకు గురయ్యాడు. వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో రౌడీ షీటర్ గా నమోదయిన నాగమణి ఎల్లాజీ (35) ఈ మధ్యకాలంలోనే సెంటర్ జైలు నుంచి విడుదలయ్యాడు.
కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జ్ఞానాపురం, హిందూ స్మశాన వాటికలో పనిచేస్తున్న వాళ్ల దగ్గర కత్తి చూపించి బెదిరించి డబ్బులు డిమాండ్ చేసాడు. అక్కడ పని చేస్తున్న మూర్తి అనే వ్యక్తి గడ్డపారతో కొట్టగా నాగమణి ఎల్లాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. ,