కోరుట్ల : పట్టణంలో గణేశ నవదుర్గ మండలి ఆధ్వర్యంలో త్రిశక్తి మాత ఆలయంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వారాహి మాతకు మంగళవారం రాత్రి లక్ష పుష్పార్చన ఘనంగా నిర్వహించారు. వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో 9 రోజుల పాటు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ అని ఈ సమయంలో వారాహి దేవిని పూజించడం ద్వారా భక్తులు శత్రువుల నుండి రక్షణ పొందుతారని, కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఈ నవరాత్రులు జూన్ 26 నుండి జూలై 4 వరకు జరుపుకుంటారు. వారాహి నవరాత్రుల ప్రత్యేకత ఏంటంటే శత్రువుల నుండి రక్షణ వారాహి దేవిని పూజించడం ద్వారా శత్రువుల నుండి దుష్ట శక్తుల నుండి రక్షణ లభిస్తుందని భక్తులు నమ్ముతారు. వారాహి దేవి అనుగ్రహంతో భక్తుల కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తారు. ఆషాఢ మాసంలో వచ్చే ఈ నవరాత్రులు గుప్త నవరాత్రులలో భాగంగా జరుపుకుంటారని తెలిపారు.గణేశ నవదుర్గ మండలి ప్రధాన కార్యదర్శి గజ్జల శంకర్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుండి వారాహి దేవి నవరాత్రులు జరుపుతున్నామని, కానీ ఈ సంవత్సరం నుండి ప్రత్యేకంగా అమ్మవారి విగ్రహం పెట్టి వారాహి పూజలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.వారాహి మాత నవరాత్రులు జరుపుకోవడం పట్టణంలో ఇదే మొదటి మొదటిసారి అని ప్రతిరోజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.దసరా నవరాత్రులకు, వారాహి నవరాత్రులకు తేడా ఉంటుందని వారాహి నవరాత్రులను గుప్త నవరాత్రులు అంటారని, ఈ మాతకు రాత్రి వేళ పూజిస్తారని, వారాహి మాతకు రాత్రి వేళలో ధూపం, దీపం, నైవేద్యం అభిషేకం హోమం ఉంటాయని, సూర్యాస్త సమయములో పూజ కార్యక్రమాలు జరుపుకుంటారని ఆయన తెలిపారు.ఈకార్యక్రమంలో గణేశ నవదుర్గ మండలి గౌరవ అధ్యక్షులు కట్ట నారాయణ, అధ్యక్షులు కటుకం గణేష్, ప్రధాన కార్యదర్శి గజ్జల శంకర్, కోశాధికారి అడువాల ప్రభాకర్ కార్యవర్గ సభ్యులు గాజుల రమేష్, లక్కంపల్లి విజయ్, నవీన్ కార్యకర్తలు కటుకం గంగారాం, చింతకింది సత్యనారాయణ, కార్తీక్, ప్రవీణ్, రాము, కళ్యాణ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
త్రిశక్తి మాత ఆలయంలో వారాహి నవరాత్రి ఉత్సవాల భాగంగా అమ్మవారికి లక్ష పుష్పార్చన
